
- తెల్లాపూర్ బీరప్ప జాతరలో మాజీ మంత్రి హరీశ్రావు
రామచంద్రాపురం, వెలుగు: కురుమ జాతిని గౌరవించి, వారికి సముచిత స్థానం కల్పించిన ఏకైన పార్టీ బీఆర్ఎస్అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో సోమవారం జరిగిన బీరప్ప జాతరకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు కురుమలను ఆదరించారని గుర్తు చేశారు. కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి మొదటి సారిగా ఓ కురుమనే చైర్మన్ చేసిన ఘనత తమదని, వారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది కేసీఆర్ అని పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేశామని, నేడు సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తెల్లాపూర్లో మాజీ చైర్ పర్సన్ లలితా సోమిరెడ్డి చేసిన పోరాటం వల్లే కురుమలకు ఎకరా భూమి కేటాయించామని, భవిష్యత్లో గుడి అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కురుమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశం, మాజీ సర్పంచ్సోమిరెడ్డి, బీఆర్ఎస్నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్ కుమార్, పీఏసీఎస్చైర్మన్ బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు బాల్రెడ్డి, సత్యనారాయణ, దేవేందర్ యాదవ్, అంజయ్య, శ్రీకాంత్ గౌడ్, నర్సింహ, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.